ఉత్తరప్రదేశ్ లోఓ ముస్లిం కుటుంబం మత సామరస్యాన్ని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచింది. పెళ్లిపత్రికలో సీతారాముల ఫొటోను ముద్రించి అందరూ ఒక్కటేనని చాటింది. వివరాల్లోకి వెళితే యూపీలోని చిలావా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వదువు తల్లిదండ్రులు ఈ విధమైన పత్రికను ముద్రించారు.
ఈ సందర్భంగా వధువు తల్లి మాట్లాడుతూ, తమ గ్రామంలో హిందూ, ముస్లింలు సోదరభావంతో మెలుగుతుంటారని చెప్పారు. పరమత సహనాన్ని తాము ప్రచారం చేయాలనుకున్నామని తెలిపారు. మత పరంగా తాము విడిపోవాలనుకోవడం లేదని చెప్పారు. వధువు సోదరుడు మొహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ పెళ్లి పత్రికను చూసి తమ గ్రామస్తులంతా చాలా సంతోషించారని అన్నాడు. గ్రామంలోని ప్రజల స్పందన చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు.