telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అభిమానుల మనసులు గెలుచుకున్న సిరాజ్…

క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు భారత పేసర్ మహ్మద్ సిరాజ్. అందుకు అతను చేసిన ఓ పనే కారణం. అయితే ప్రస్తుతం ఆసీస్-భారత్ జట్ల మధ్య పింక్ బాల్ టెస్ట్ కు సంబంధించిన ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో నిన్న బుమ్రా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతను కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ బౌలర్ కామెరొన్ గ్రీన్ కు తలకు నేరుగా వెళ్లి తగిలింది. ఆ సమయంలో బుమ్రా పరుగు కోసం ప్రయత్నించగా… నాన్ స్ట్రైకర్ గా ఉన్న సిరాజ్ మాత్రం తన బ్యాట్ ను అక్కడే వదిలేసి నేరుగా కామెరొన్ దగ్గరకు వెళ్లి అతడిని పరీక్షించాడు. ఈ వీడియోను స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటూ బీసీసీఐ లో పోస్ట్ చేసింది. దాంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. దాంతో అందరూ అతడిని ప్రశంసిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో బాగా రాణించడంతో ఆసీస్ పర్యటనకు ఎంపికైన సిరాజ్… అక్కడికి వెళ్లిన వెంటనే ఓ చేదు వార్త వినాల్సి వచ్చింది. హైదరాబాద్ లో ఉంటున్న తన తండ్రిని కోల్పోయాడు సిరాజ్. అప్పుడు అతను తిరిగి భారత్ కు వస్తాడు అనుకుంటు అంతా… కానీ… ఆట పట్ల తనకున్న ప్రేమతో తిరిగి భారత్ రాకుండా అక్కడే ఉండిపోయాడు. తన తండ్రి కోరికను నెరవేర్చడానికే అక్కడ ఉన్నట్లు చెప్పాడు సిరాజ్.

Related posts