telugu navyamedia
CBN pm modi ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న ప్రధాని మోదీ

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు.

ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రధాని వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం యొక్క విశిష్టతను, చారిత్రక ప్రాముఖ్యతను అర్చకులు ప్రధానికి వివరించారు.

అనంతరం ప్రధాని తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు.

“శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థించుకున్నాను.

నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం,వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ ట్వీట్ చేసారు .

Related posts