telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జేసీ ప్రభాకర్‌ రెడ్డి కరోనా బారిన పడటం బాధాకరం: లోకేశ్

Nara Lokesh

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి కడప జైలులో కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి గారి నేర మనస్తత్వమే కారణమని దుయ్యబట్టారు. ఆయన కరోనా బారిన పడటం బాధాకరమని పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్ గారు ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసమని ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బెయిల్ పై విడుదలైన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్లీ అరెస్ట్ చేశారు. ఆసుపత్రికి తరలించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ట్విటర్ లో లోకేశ్ పేర్కొన్నారు. 

Related posts