telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లాక్ డౌన్ ఉల్లంఘించారని.. రోజాపై సర్వత్ర విమర్శలు

roja ycp mla

లాక్ డౌన్ సమయంలో నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పలువురు మండిపడుతున్నారు.పుత్తూరు సుందరయ్యనగర్ లో బోరుబావి ప్రారంభోత్సవానికి రోజా వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

జనం రోజా పై పువ్వులు చల్లుతుండగా ఆమె పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులతో కలిసి ముందుకు కదిలారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై విపక్ష నేతలు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని విమర్శలు గుప్పిస్తున్నారు.

Related posts