telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జగన్‌ చేతిని ముద్దాడిన రోజా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. కొత్త మంత్రులచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. చాలామంది మంత్రులు భావోద్వేగానికి గురియ్యారు.

ప్రమాణస్వీకారోత్సవం అనంతరం కొందరు కొత్త మంత్రులు వీర విధేయతను చాటుకున్నారు. కొందరు సీఎం జగన్​, గవర్నర్ బిశ్వభూషణ్‌కు నమస్కరించి వెళ్లిపోగా.. మరికొందరు మాత్రం జగన్‌ కాళ్లకు మొక్కి.. చేతులు ముద్దాడి వెళ్లారు.

గుడివాడ అమర్నాద్.. ముత్యాలనాయుడు.. జోగి రమేష్.. ఉషశ్రీ చరణ్.. మేరుగ నాగార్జున.. రాజన్న దొర.. విడదల రజనిలు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు.. సీఎం కు పాదాభివందనం చేసి తమకు మంత్రులుగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

సీఎం జగన్‌ను ఎంతో అభిమానించే రోజా సైతం ఈరోజు ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం జగన్ వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ చేతిని తీసుకుని ముద్దుపెట్టుకున్నారు. సీఎం ఆమెను ఆశీర్వదించారు.

డిగ్రీ చదువు మధ్యలో ఆపేసి సినిమాల్లోకి వచ్చిన రోజా సినిమాల్లో హీరోయిన్‌గా రాణించారు. అనంతరం 1999లో రాజకీయాల్లోకి వచ్చిన రోజా మొదట తెలుగుదేశం పార్టీలో పని చేశారు. 2004, 2009లలో తెలుగుదేశం పార్టీ తరుఫున నగరి, చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి 2014,2019లో నగరి నియోజక వర్గం నుంచి గెలుపొందారు. 2019 నుంచి రెండేళ్ల పాటు ఏపీ ఐఐసీ చైర్మన్ గా పని చేశారు.

Related posts