telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విశాఖ‌లోనే పాల‌నా రాజ‌ధాని: చంద్రబాబు త‌ల‌కింద‌కి కాళ్ళుపైకి పెట్టి తపస్సు చేసినాఆగ‌దు

విశాఖ‌లోనే ప‌రిపాల‌న రాజ‌ధాని ఉంటుంద‌ని, ఎవ‌రు ఆపినా ఆగ‌ద‌ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. జాల‌రిపేట‌లో మ‌త్స్య‌కార దేవ‌తలు ఆల‌య నిర్మాణం ప‌నులు ప‌రిశీలించారు.

ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చితీరుతుందని, ఎవరు అడ్డుకున్నా.. ఎవరు అవునన్నా.. కాదన్నా విశాఖ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ అవుతుందన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు త‌ల‌కింద‌కి కాళ్ళుపైకి పెట్టి తపస్సు చేసినా దీన్ని ఆపే శక్తి ఆయనకు లేదన్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఆలస్యమైందన్నారు. తప్పకుండా ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖకు మారుతుందని విజయసాయి రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

రాష్ర్ట‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌నేది పార్టీ అధ్య‌క్షుడు నిర్ణ‌యం తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీల‌కు రాష్ర్ట‌ప‌తిగా అవ‌కాశం ఇస్తామంటే ఎవ‌రు కాదంటారు. ద‌శాబ్దాలుగా ఆ వ‌ర్గాలు సామాజికంగానూ, రాజ‌కీయంగానూ పైకి వ‌స్తామంటే అన్ని పార్టీలు స‌హ‌క‌రిస్తాయ‌న్నారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అయ్య‌న్న‌పాత్రుడు చెరువు కాలువ‌ను అక్ర‌మించారు. హైకోర్టులో అయ్య‌న్న‌కు తాత్కాలికంగా స్టే ఇవ్వొచ్చు. అయ్య‌న్న అక్ర‌మ‌ణ విష‌యం అధికారులు చూసుకుంటారని తెలిపారు.

Related posts