*తెలుగుదేశం నేతలపై రోజా హాట్ కామెంట్స్
*అచ్చెన్నాయుడు అచ్చెచ్చిన అంబోతు..
*చంద్రబాబునాయుడుకు పట్టు చీరలు కావాలో?
పసుపు చీరలు కావాలో తేల్చుకోవాలి
ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా విపక్షాల తీరుపై తీవ్ర స్తాయిలో మండిపడ్డారు . కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించకోలేనందుకు చంద్రబాబునాయుడు, నారాలోకోష్ పచ్చ చీరలు కట్టుకోవాలని అన్నారు. పట్టు చీరలు కావాలో? పసుపు చీరలు కావాలో ? ఏ చీర కావాలో చెప్పండి పంపిస్తా అంటూ రోజా హాట్ కామెంట్స్ చేశారు.
సీఎం జగన్ గురించి టీడీపీకి చెందిన మహిళా నాయకురాలితో అవాకులు చెవాకులు పేలితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు.. సీఎం సతీమణి పై కూడా నీచంగా టీడీపీ నేతలు మాట్లాడడాన్ని తప్పు బట్టారు.
టీడీపీ.. మహిళా ద్రోహి పార్టీ అని , టీడీపీలో ఉన్నంత మంది ఉన్మాదులు దేశంలో ఎక్కడా లేరని అని రోజా విమర్శించారు. అందరి కంటే పెద్ద ఉన్మాది చంద్రబాబు అని ఆమె విమర్శించారు. .చంద్రబాబును ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. సీఎం జగన్ ఇమేజ్ ను దిగజార్చేందుకు టీడీపీ కంకణం కట్టుకుందన్నారు.
కాల్ మనీ సెక్స్ రాకెట్ ద్వారా మహిళలను ఏ రకంగా వేధించారో అందరికీ తెలుసన్నారు . టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బూటు కాలితో మహిళలను కొడతాడని, వాళ్లు కాదా ఉన్మాదులని మండిపడ్డారు.
సీఎం జగన్ దమ్మున్న నాయకుడన్నారు. మహిళా సాధికారిత దిశగా సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 75 శాతం మహిళలకే అందిస్తున్నామన్నారు.
90 శాతం సర్పంచ్ స్థానాల్లో వైసీపీ మద్దతు దారుల విజయం ఖాయం…