telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

శానిటైజర్ల వినియోగాన్ని కొనసాగించాలి: మంత్రి కేటీఆర్‌

KTR TRS Telangana

రాష్ట్రంలో దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్‌ శాఖపై మంత్రి కేటీఆర్‌ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ శానిటైజర్ల వినియోగాన్ని కొనసాగించాలన్నారు. పట్టణాల్లో సరి, బేసి విధానంలో దుకాణాల నిర్వహణను పర్యవేక్షించాలన్నారు. వ్యాక్సిన్‌ వచ్చేవరకు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉందన్నారు

వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. కరోనా కట్టడికి అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్య, పురపాలకశాఖలు ఇవాళ విడుదల చేస్తాయని తెలిపారు. మాస్కుల వినియోగం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ల వినియోగాన్ని కొనసాగించాలన్నారు. కరోనా కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్‌ కమిషనర్లను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

Related posts