హైదరాబాద్లోని టీవీ5 కార్యాలయంపైకి కొందరు దుండగులు రాళ్లు రువ్వి గత అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి మీడియాపై దాడి అంటే వారి విధులకు ఆటంకం కలిగించడమేనని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నానని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఇప్పుడున్న అసెంబ్లీలో స్థలం సరిపోవడం లేదు: ఎమ్మెల్యే బాల్క సుమన్