telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

టీవీ5 దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు

chandrababu

హైదరాబాద్‌లోని టీవీ5 కార్యాలయంపైకి కొందరు దుండగులు రాళ్లు రువ్వి గత అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి మీడియాపై దాడి అంటే వారి విధులకు ఆటంకం కలిగించడమేనని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నానని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Related posts