telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

వరుస నష్టాలలో .. మార్కెట్లు.. ప్రభుత్వ వ్యతిరేకతే కారణమా.. !

husge loses again in stock markets

మూడో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాల్లో ముగిశాయి. ఆటోమొబైల్, బ్యాంకింగ్ దిగ్గజాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం మార్కెట్లను నష్టాల్లోకి నడిపించాయి. ముడి చమురు అంశం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 80 పాయింట్లు నష్టపోయి 38,564కు పడిపోయింది. నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 11,575 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (3.93%), సన్ ఫార్మా (3.08%), బజాజ్ ఫైనాన్స్ (1.47%), కోల్ ఇండియా (1.45%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.38%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-3.60%), యస్ బ్యాంక్ (-2.33%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.18%), టాటా స్టీల్ (-2.15%), హీరో మోటో కార్ప్ (-1.74%).

Related posts