ఆరు రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది.
ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా 58 నియోజకవర్గాలకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ జరుగుతుంది.
ఆరో విడతలో 899 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
భారత ఎన్నికల సంఘం ప్రకారం 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు, 5,120 మంది థర్డ్ జెండర్లతో సహా 11.13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఢిల్లీలో ఉదయం 9 గంటల వరకూ సగటున 10 శాతం పోలింగ్ నమోదైంది.
ఢిల్లీలో 8.94 శాతం పోలింగ్ నమోదవగా పశ్చిమ బెంగాల్లో గరిష్ఠంగా 16.54 పోలింగ్ నమోదైంది.
ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ఓటు వేశారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావ్ ఇందర్జిత్ సింగ్, మంత్రి జైశంకర్ బీజేపీ నేత మేనకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ ఖట్టర్, మనోజ్ తివారీ, మహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్, మాజీ క్రికెటర్ బీజేపీ నేత గౌతం గంభీర్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


బీజేపీ నేతలకు పబ్లిసిటీపిచ్చి పట్టుకుంది: తలసాని