telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనాను పక్కన పెట్టి ప్రత్యర్థులపై టార్గెట్: పవన్ కల్యాణ్

pawan

ఏపీలో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే అధికార పార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని పవనజనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలను అందించాల్సిన తరుణంలోవైసీపీ పెద్దలు బురద చల్లే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. రెండు మూడు రోజులుగా ఇలాంటి పరిణామాలే జరుగుతున్నాయని చెప్పారు.

కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య వాగ్వాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు. కన్నాపై వైసీపీ నేతలందరూ వరుసగా విరుచుకుపడుతున్నారు. కన్నాపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయని అన్నారు.

కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ తప్పులను వేలెత్తి చూపే వారిపై వైసీపీ పెద్దలు బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రపంచాన్ని కరోనా వైరస్ ఆక్రమిస్తున్న కారణంగా అగ్ర రాజ్యాలు సైతం చిగురుటాకులా వణికిపోతున్నాయని, వాటి ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతోందని అన్నారు. రోగులందరికీ వైద్య సేవలు అందించలేక అగ్రదేశాలు అవస్థలు పడుతున్నాయని చెప్పారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందులను పంపమని భారతదేశాన్ని ప్రాధేయపడుతున్నాయని చెప్పారు.

Related posts