telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన “కుంకుమ భాగ్య” సీరియల్ నటి

Sikha SIngh

సీరియల్ నటి, “కుంకుమ భాగ్య” ఫేమ్ శిఖా సింగ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ‘‘మేరీ డోలి తేరి అంగన, ఘర్ కీ లక్ష్మీ బేటియాన్, ఉత్తరన్, నా ఆనా ఇస్ దే లాడో, ఫుల్వా, అదాలత్, ససురాల్ సిమర్ కీ, మహాభారత్, ప్యార్ కో హో జానే దో, చంద్ర నందిని, కుండలి భాగ్య, లాల్ ఇష్క్’’ లాంటి సీరియల్స్‌లో నటించిన శిఖా సింగ్ కరణ్ షాను ప్రేమించి పెళ్లాడింది. ప్రెగెన్సీ సమయం నుంచే అభిమానులతో టచ్ ఉంటూ అప్‌డేట్స్ ఇచ్చిన ఆమె ఈ నెల 16వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారిని ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతూ శిఖా సింగ్ భర్త కరణ్ షా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మా పాపకు ”అలయ్‌నా సింగ్ షా” అనే పేరు పెట్టుకొన్నాం. చిన్నారి రాకతో మా కుటుంబం మొత్తం ఆనందంలో మునిగితేలుతోందంటూ శిఖా సింగ్ ఆమె భర్త కరణ్ షా ఇన్స్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. మరోవైపు పండంటి బిడ్డకు జన్మనిచ్చాక శిఖా సింగ్ మాట్లాడుతూ.. జీవితంలో కొత్త పాత్రలోకి ప్రవేశించానని చెప్పారు. జీవితం ప్రతీ మలుపులో ఓ బాధ్యతను భుజానికి ఎత్తుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఇది చూసిన నెటిజన్స్ శిఖా సింగ్ దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ చిన్నారికి వెల్‌కమ్ చెబుతున్నారు. ఇకపోతే అప్పుడే పుట్టిన చిన్నారికి ”అలయ్‌నా సింగ్ షా” అనే పేరు పెట్టడం వెనుక సీక్రెట్ చెప్పేసింది శిఖా సింగ్. తాము మాల్దీవ్ వెకేషన్ వెళ్ళినప్పుడే అక్కడ అలయ్‌నా పేరు విని ప్రేరణ పొందామని, అమ్మాయి పుడితే అదే పేరు పెట్టుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యామని చెప్పింది. ప్రెగ్నెన్సీ సమయంలో తన భర్త, తాను కరోనా పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, డెలివరీ టైంలో డాక్టర్లు కూడా మెరుగైన వైద్యం అందించారని తెలిపింది. కొంతకాలం రెస్ట్ తీసుకున్నాక తిరిగి కెమెరా ముందుకొస్తానని చెప్పింది శిఖా సింగ్.

Related posts