తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులుఅక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 130 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకొచ్చిన కారు మలుపు వద్ద బోల్తా పడినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు బొమ్మలరామారం నుంచి భువనగిరి వైపు హోండా కారులో వెళ్తున్నారు. మైసిరెడ్డిపల్లి శివారు మలుపు వద్ద కారు అదుపుతప్పింది. బొమ్మలరామారంలోని ఓ ప్రైవేట్ గెస్ట్హౌజ్లో అందరూ కలిసి పార్టీ చేసుకున్నట్లు సమాచారం.
previous post