telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణ పోలీసులు సరైన పని చేశారు: నిర్భయ తల్లి

nirbhaya-mother police

దిశ హత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై నిర్భయ తల్లి ఆశాదేవి ప్రశంసలు కురిపించారు. ఎన్ కౌంటర్ వార్తను గురించి తెలుసుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసుల పై ఎటువంటి విచారణ ఉండరాదని నిర్భయ ఆశాదేవి డిమాండ్ చేశారు. పోలీసులపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలని భావించినా, మరో ఉద్యమం మొదలవుతుందని ఆమె హెచ్చరించారు.

పోలీసులు విధించిన శిక్షను చూసి తానెంతో సంతోషించానని, వారు తమ విధిని సక్రమంగా నిర్వర్తించారని కొనియాదారు. ఈ ఘటనతో మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారికి ఓ కఠిన హెచ్చరిక వెళ్లిందని అన్నారు. తాను న్యాయం కోసం గత ఏడేళ్ల నుంచి కోర్టు స్తంభాలను పట్టుకుని ఉన్నానని, ఇప్పటికీ నిందితులకు శిక్ష అమలు కాలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. దేశంలోని న్యాయ వ్యవస్థ నేరస్తులను శిక్షించడంలో సత్వర నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

Related posts