*హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దారుణం..
*కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త
* భార్య మృతదేహాన్ని ఒక డ్రమ్ములో పెట్టి పారిపోయిన నిందితుడు
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపిన ఓ భర్త.. మృతదేహాన్ని ముక్కలు చేసి వాటర్ డ్రమ్ లో పెట్టి పారిపోయాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో ఈ ఘోరం జరిగింది.
వివరాల్లోకి వెళితే..
మహబూబ్ నగర్ తండాకు చెందిన అనిల్, సరోజ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం వీరి పెళ్లి జరిగింది. అయితే ఇందుకు ముందు అనిల్ పెళ్ళి జరిగిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని సరోజ దాటి పెట్టిన విషయం తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయం పుట్టింటికి కూడా వెళ్ళిపోయిందని చెబుతున్నారు.
అయితే ఈ విషయంలో పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం సాయంత్రం కూడా ఇద్దరూ గొడవ పడినట్లు స్థానికులు పోలీసులతో చెప్పారు.
అయితే రెండురోజులుగా సరోజ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ..కుమార్తె కోసం ఇంటికి వచ్చిన తండ్రి ..తాళం పగలగొట్టిన లోపల దృశ్యాలు చూసి విస్తుపోయారు.
సరోజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న అనిల్ కోసం గాలిస్తున్నారు.