సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగుతోంది. హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులను కేటినెట్ ఆదేశించింది. వైద్యారోగ్య శాఖపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం కావాల్సిన ఏర్పాటు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. అలాగే రాష్ట్రంలో ఆరోగ్య, మౌలిక వసతుల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం లభించింది.
రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరిచినా కొవిడ్ కేసుల్లో పెరుగుదల లేదని అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. కరోనా పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.56 కోట్లకుపైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుండి ప్రారంభం అయ్యిందని.. అందరు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని.. ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కేబినెట్ నిర్దేశించింది. చిన్న పిల్లలకు కరోనా వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 24 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సమావేశాల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయాలు ఇవే..
* పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. ఉపసంఘం ఛైర్పర్సన్గా మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహరిస్తారు. మంత్రులు జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్రెడ్డి సభ్యులుగా ఉంటారు.
* కొత్త జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో సంఘం ఏర్పాటు చేశారు. మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు.