telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వం చెడు చేస్తే ప్రతిపక్షం ప్రశ్నింస్తుంది: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Jagga Reddy MLA

ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తుందని, చెడు చేస్తే ప్రశ్నింస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఉన్న ఉన్న స్వేచ్చ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉండదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌ న్యాయపరమైది కాబట్టే ప్రగతి భవన్‌ ముట్టడి,సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్నాను.

కాంగ్రెస్‌ ఎప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేశవరావు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పులిలాగా ఉండేవారని, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తర్వాత పిల్లిలాగా మారిపోయారని ఎద్దేవా చేశారు.

Related posts