telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం..కొన్ని జిల్లాల్లో రెడ్ అలెర్ట్

Mumbai Heavy Rains

గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కేరళ అతలాకుతలమవుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో లోతట్టు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇడుక్కి, మళప్పురం జిల్లాల్లో అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేస్శారు. కోజికోడ్, పాలక్కాడ్, ఎర్నాకుళం, కన్నూర్, త్రిశూర్ ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

ఇడుక్కి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మున్నార్ సమీపంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించారు. అనేక ప్రాంతాల్లో వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాదు, కమ్యూనికేషన్ వ్యవస్థలు సైతం పనిచేయడంలేదు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలుసహాయక చర్యలు చేపట్టాయి.

Related posts