తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. గతేడాది డిసెంబరు 27న కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిసి కారు గుర్తును పోలిన సింబల్స్, కారు గుర్తును బోల్డ్ చేయడంపై కేసీఆర్ ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఫిర్యాదుపై స్పందిస్తూ కారు గుర్తు బోల్డ్ చేయడంపై ఎన్నికల సంఘం సూచనలు కోరింది. మార్పు చేసిన కారు గుర్తు సింబల్ని ఎంపీ వినోద్ ఈసీకి సమర్పించారు. బ్యాలెట్లో కారు రంగు సరిగా కనిపించకపోవడం వల్ల వృద్ధులు, కంటి సమస్య ఉన్న వారు కారు గుర్తును పోల్చుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారని వినోద్ తెలిపారు.
previous post
next post