telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బంపర్‌ ఆఫర్‌.. ఓటర్లకు శ్రీవారి లడ్డు పంపిణీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి

ఆంధ్ర ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడత ఎన్నికలు పూర్తి అయ్యాయి. పంచాయతీ ఎన్నికలైనప్పటికీ…సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య హోరా హోరీగా పోటీ నడుస్తోంది. అయితే.. ఈ ఎన్నికల్లో చిత్ర-విచిత్ర సంఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో ఓటర్లకు ఏకంగా శ్రీవారి లడ్డూలు పంచుతున్నాడు ఓ సర్పంచ్‌ అభ్యర్థి. అది కూడా రేషన్‌ పంపిణీ చేసేందుకు ఉపయోగించే వాహనం ద్వారానే కానిచ్చేస్తున్నాడు. వాహనం నిండా లడ్డూల సంచుల్ని వేసుకున్న సర్పంచ్‌ అభ్యర్థి… SC, STలకు ఐదు లడ్డూల చొప్పున, ఇతర కులాల వారికి పది లడ్డూల చొప్పున పంచుతున్నాడు. ఈ తంతంగాన్ని మొత్తం స్థానిక యువకులు సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రీకరించారు. ఈ ఘటనపై సర్పంచ్‌ అభ్యర్థి నిర్వాకంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts