రాష్ట్రంలో అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే యువతకు సుమారు లక్ష ఉద్యోగాలు కల్పించడం అనేది ఒక చరిత్ర అని ఏపీ మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు గ్రామంలో నూతంనంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పాలనలో నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు.
గాంధీజీ 150వ జయంతి రోజే.. గ్రామ సచివాయాన్ని ప్రారంభించడం దేశ పౌరురాలిగా తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. మన జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన నాంది పలికిందని ఆమె అన్నారు. జగనన్న పాదయాత్రలో యువత కష్టాలను చూసి తమ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలలో భాగంగానే ఈ నియామకాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.