telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

విరాళాల కోసం క్రికెటర్ల ప్రాణాలను రిస్క్ చేయొద్దు: కపిల్ దేవ్

Kapil-Dev

కరోనాపై పోరాటానికి భారత్, పాకిస్థాన్ దేశాల్లో విరాళాలు సేకరించడం కోసం రెండు దేశాల క్రికెట్ జట్ల మధ్య సిరీస్‌ ఏర్పాటు చేయాలని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదించాడు. మూడు వన్డేల సిరీస్‌ను దుబాయ్‌ లాంటి తటస్థ వేదికపై ఖాళీ స్టేడియంలో నిర్వహించాలన్నాడు. దాని ద్వారా వచ్చే విరాళాలను ఇరు దేశాలకు సమానంగా పంచాలని సూచించాడు. ఈ ప్రతిపాదనపై భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ స్పందించాడు. విరాళాలు సేకరించడం కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ క్యాప్తైన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.

క్రికెట్ సిరీస్ అనేది అక్తర్ అభిప్రాయం మాత్రమే. కానీ, మనం ఇప్పుడు విరాళాలు సేకరించాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బు ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అందరూ కలిసి కట్టుగా పనిచేయడమే ఇప్పుడు ముఖ్యం. కరోనాపై పోరాటానికి బీసీసీఐ ఇప్పటికే రూ. 51 కోట్లు సాయం చేసింది. అవసరమైతే ఇంకా విరాళం ఇచ్చే స్థాయిలో ఉందిని కపిల్ పేర్కొన్నారు.

Related posts