ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయవాడ ప్రజల కల ఎట్టకేలకు నెరవేరనుంది. ఎప్పటినుంచో కోరుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఇటీవల వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 4న ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల చేతులమీదుగా ఈ భారీ ఫ్లైఓవర్ ఓపెనింగ్ కు ముహూర్తం ఖరారు చేశారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించిన నేపథ్యంలో ఆ కార్యక్రమం వాయిదాపడింది. అయితే, కనకదుర్గ ఫ్లైఓవర్ ను ఈ నెల 18న ప్రారంభించనున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరవుతారని ట్విట్టర్ లో కేశినేని తెలిపారు.

