telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు!

vijayawad flyover

ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయవాడ ప్రజల కల ఎట్టకేలకు నెరవేరనుంది. ఎప్పటినుంచో కోరుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఇటీవల వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 4న ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల చేతులమీదుగా ఈ భారీ ఫ్లైఓవర్ ఓపెనింగ్ కు ముహూర్తం ఖరారు చేశారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించిన నేపథ్యంలో ఆ కార్యక్రమం వాయిదాపడింది. అయితే, కనకదుర్గ ఫ్లైఓవర్ ను ఈ నెల 18న ప్రారంభించనున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరవుతారని ట్విట్టర్ లో కేశినేని తెలిపారు.

Related posts