భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో రాష్ట్రపతి ప్రాంగణంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హాజరైన రాజకీయ, అధికార, అనధికార ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినిమా ప్రముఖులు, బిమ్స్టెక్ దేశాధినేతల నడుమ ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్లలేకపోయినందుకు బాధపడుతున్నానని హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. పి.ఎమ్.ఓ నుంచి తనకు వచ్చిన ఆహ్వానాన్ని పోస్ట్ చేసిన ఆమె, తనకు ఆ ఆహ్వానం ఆలస్యంగా అందిందని, అందువల్లే ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని తెలిపింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరుకాలేకపోయినందుకు చాలా బ్యాడ్గా ఫీలవుతున్నానని తెలిపిన ఆమె, ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ ఈ అద్భుతమైన పదవీకాలంలో మరింత శక్తి లభించాలని కోరింది.
next post