జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు మంగళగిరి మండలం ఇప్పటం గ్రామ పరిధిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో జనసేన ఆవిర్భావ సభకోసం విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వారథిపై బ్యానర్లు, ఫ్లెక్సీలను కార్యకర్తలు, నేతలు ఏర్పాటు చేశారు. అయితే వాటికి అనుమతి లేదంటూ మున్సిపల్ సిబ్బంది, పోలీసులు తొలగిస్తున్నారు.
జనసేన ఫ్లెక్సీల తొలగింపుపై సమాచారం అందుకున్న జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్.. స్పాట్కి వెళ్లి మున్సిపల్ సిబ్బందిని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులే ఇదంతా దగ్గరుండి చేయిస్తున్నారని నాదెండ్ల మనోహర్ వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారంటూ నాదేండ్ల ఆరోపించారు
అధికార పార్టీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తూ ఆవిర్భావ సభకు ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జనసేన నేతలు, కార్యకర్తలు కూడా భారీగా చేరుకోవడంతో వారధిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది.
అయితే.. ఈ విషయం తెలుసుకోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోంది: లోకేశ్