telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఇంటర్ ఫలితాల అవకతవకలపై .. జనసేన డిమాండ్.. రాజీనామా..

జనసేన పార్టీ తెలంగాణలో ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలను తీవ్రంగా ఖండించింది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ జనసేన ఇన్ చార్జి నేమూరి శంకర్ గౌడ్ ఓ ప్రకటన చేశారు.

ఇంటర్ ఫలితాల వెల్లడిలో లోపాలపై ఇంటర్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Related posts