జనసేన పార్టీ తెలంగాణలో ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలను తీవ్రంగా ఖండించింది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ జనసేన ఇన్ చార్జి నేమూరి శంకర్ గౌడ్ ఓ ప్రకటన చేశారు.
ఇంటర్ ఫలితాల వెల్లడిలో లోపాలపై ఇంటర్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.