మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తొలిసారి నిన్న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామమందిర నిర్మాణంలో శివసేన కీలక పాత్ర పోషిస్తుందన్నారు.తాము విడిపోయింది బీజేపీ నుంచే కానీ.. హిందూత్వం నుంచి కాదని స్పష్టం చేశారు.
రాముడి ఆశీర్వాదం తీసుకునేందుకే అయోధ్యను సందర్శించినట్టు చెప్పారు. తానిక్కడికి రావడం ఏడాదిలో మూడోసారని వివరించారు. హిందూత్వం పేరుతో గిమ్మిక్కులు చేయాల్సిన అవసరం తమకు లేదని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.