మద్రాస్ హైకోర్టు షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్పై విధించిన తాత్కాలిక నిషేధం వల్ల.. నాటి నుంచి రోజుకు రూ.4.5 కోట్లు నష్టపోయినట్లు టిక్టాక్ మాతృ సంస్థ(డెవలపర్ కంపెనీ) బైటెడెన్స్ పేర్కొంది. కంపెనీ ఆర్థిక మూలాలపై ఈ నిషేధం తీవ్రంగా దెబ్బకొట్టినట్లు వెల్లడించింది. సుప్రీం కోర్టులో ఈ సంస్థ తరపున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ మను సింఘ్వీ ఈ వివరాలను వెల్లడించారు.
టిక్టాక్పై నిషేధం వల్ల 250 ఉద్యోగాలు చిక్కుల్లో పడ్డాయని తెలిపారు. కోర్టు ఆదేశాలతో టిక్టాక్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ యాప్స్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు టిక్టాక్పై విధించిన తాత్కాలిక నిషేధంపై ఏప్రిల్ 24లోపు నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో నిషేధాన్ని ఎత్తివేస్తామని మద్రాస్ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.