రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన రేపు విశాఖలో తలపెట్టిన “చలో విశాఖపట్నం” లాంగ్ మార్చ్కు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ట్విట్టర్లో తెలియజేశారు. భనవ నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తిచూపే లక్ష్యంతో కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
మద్దతుదారులు రాకుండా అడ్డుకునేందుకు కొందరు కావాలని లాంగ్ మార్చ్కు అనుమతిలేదంటూ ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి విశాఖలో మద్దిలపాలెం జంక్షన్లోని తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది కార్మికుల గొంతు వినిపిస్తామన్నారు. ఈ కార్యక్రంలో కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.

