ఉగ్రవాదుల ఏరివేత కోసం జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు భారీగా కూంబింగ్ చేపట్టాయి. శ్రీనగర్లోని పంథా చౌక్ చెక్పోస్టు వద్ద విధుల్లో సీఆర్పీఎఫ్ జవానుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారయ్యారు. అప్రమత్తమైన స్థానిక భద్రతా సిబ్బంది పోలీసులతో కలిసి వారి కోసం గాలింపు మొదలుపెట్టారు.ఈ క్రమంలో భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.
దీంతో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ పోలీసు అధికారి కోడా ప్రాణాలు కోల్పోయాడు. గత మూడురోజుల్లో ఇప్పటి వరకు 10 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
ఎస్సీ వర్గీకరణపై వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలి: మంద కృష్ణ