telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు: బీజేపీ ఎమ్మెల్యే

against bjp trying to apply last weapon as mp resigns

జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంతో దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్ లోని కతౌలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కోసం పని చేసే బ్యాచ్ లర్స్ ఇప్పుడు దర్జాగా కశ్మీర్ వెళ్లొచ్చని, అక్కడ ప్లాట్లు, భూములు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పిన విక్రమ్ సైనీ, అందమైన కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవని వ్యాఖ్యానించారు.

ఆర్టికల్ 370 రద్దు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నిన్న ముజఫరాబాద్ లోని బీజేపీ జిల్లా శాఖ అభినందన సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న సైనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకు చేరింది. సైనీ వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Related posts