telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సభాహక్కుల నోటీసు

jagan on ap assembly sessions

టీడీపీ ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం జగన్ శాసనసభలో చేసిన అభ్యంతరకర వాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సభాహక్కుల నోటీసును ఇచ్చింది. శాసనసభ కార్యదర్శికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నోటీసులు అందజేశారు. నిన్నటి సభలో తమ ఎమ్మెల్యేలను ఉద్దేశించి బఫూన్లని వ్యాఖ్యానిస్తూ అభ్యంతరకర భాష వాడారని పేర్కొన్నారు.

సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి నిబంధనలను జగన్ ఉల్లంఘిస్తున్నారని నోటీసులోపేర్కొంది. ఇదే నోటీసులో స్పీకర్ పై కూడా టీడీపీ ఆరోపణలు చేసింది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే, పాయింటే లేదంటూ స్పీకర్ వ్యాఖ్యానిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పీకర్ మాట్లాడిస్తున్నారని ఆరోపించింది.

Related posts