ఏపికి కాబోయే సిఎం, వైఎస్ఆర్సిపి అధినేత, వైఎస్ జగన్ ఈరోజు శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. జగన్కు టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో జగన్కు వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
జగన్తో పాటు విజయసాయిరెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు. కాలినడకన జగన్ శ్రీవారి సన్నిధి చేరుకున్నారు.


ఎక్కడికి ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం… బాలకృష్ణ వ్యాఖ్యలపై సి.కళ్యాణ్