telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మోదీ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్

Jagadish Reddy,KCR

తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చారని పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్‌ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట మున్సిపల్‌ సంఘం చైర్మన్‌ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పథకాలు గుజరాత్‌తో పాటు యావత్‌ దేశంలో చర్చకు దారితీస్తున్నాయన్నారు. దీంతో ప్రధాని మోదీకి భయం పట్టుకుందన్నారు.

కేసీఆర్‌ ప్రవేశ పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని భయపెడుతున్నాయన్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో మూడేండ్లకే రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించగలినప్పుడు ఆరేండ్లు ప్రధానిగా 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ గుజరాత్‌ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వలేకపోయారన్నారు. ఏ సందర్భం లేకున్నా పార్లమెంట్‌ ఉభయసభల్లో తెలంగాణ ఇవ్వడమే అన్యాయం అన్న పద్దతిలో మాట్లాడుతున్నారని విమర్శించారు.

Related posts