దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “రూహ్ అఫ్జా”, “దోస్తానా-2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జాన్వీ నటించిన “గుంజన్సక్సేనా : ది కార్గిల్ గర్ల్” చిత్రం విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక ఇప్పటికే రూహీ అఫ్జానాతో పాటు దోస్తానా 2 లో జాన్వీ కపూర్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇది ఇలా ఉంటే.. తాజా గా ఈ భామ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫ్యూచర్లో ఎలాంటి పాత్రలు చేయాలనుందో తన ఫ్యాన్స్తో పంచుకుంది. “నన్ను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుంది. ఛాలెంజింగ్ రోల్స్ నటించాలి. అప్పుడే కదా కిక్ ఉంటుంది” అని జాన్వీ తెలిపింది. అంతేకాదు… భవిష్యత్తులో మంచి కథలు ఎంచుకుంటాను అని పేర్కొంది.
previous post