telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిలో వరదల పరిస్థితి, భద్రాచలం వద్ద ముంపు పరిస్థితిపై సీఎం ఆరా తీసారు. ప్రాణహిత తదితర నదుల ద్వారా కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల్లో చేరుతున్న వరద గురించి సీఎం ఆరా తీసారు.

కాగా పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులు అదుపులోనే వున్నాయని, భద్రాచలం వద్ద వరదను అంచనా వేస్తూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వుంటూ సహాయక చర్యల కోసం సిద్ధంగా వున్నదని @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి సీఎం గారికి వివరించారు.

రేపటెల్లుండి కూడా భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలని సీఎం ఆదేశించారు.

Related posts