telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రేయ్ ఇడియట్స్… ‘జి’ బలిసినోళ్లే క్రాకర్స్ కాల్చారు… మంచు మనోజ్ ఫైర్

Manchu-Manoj

తాజాగా ప్రధాని ఓ మంచి ఉద్దేశంతో దీపాలు వెలిగించే కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పటికీ కొంతమంది క్రాకర్స్ కాల్చి నానా రచ్చ చేయడంతో విమర్శలకు తావిస్తోంది. తాజాగా ఈ ఇష్యూపై ఫైర్ అవుతూ సంచలన ట్వీట్స్ చేశారు హీరో మంచు మనోజ్. బాణాసంచా కాల్చడం వల్ల జరిగిన భారీ అగ్ని ప్రమాదాల వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఇలాంటి పనుల్ని చేసే వాళ్లని తనదైన శైలిలో ఏకిపారేశారు మంచు మనోజ్. “ఈ క్రాకర్స్ చూస్తే.. మనవాళ్లు కరోనాని కూడా సీఎం లేదా పీఎం చేస్తారనుకుంటా.. ఓరి దీనమ్మా బతుకు.. మళ్లీ జై కరోనా అంట” అంటూ ఫైర్ అవుతూ ట్వీట్ వదిలారు. “రేయ్ ఇడియట్స్.. ఆ క్రాకర్స్ కాల్చడం ఆపండ్రా.. మనం మనుషులే తప్ప మూర్ఖులం కాదు.. క్రాకర్స్ కాల్చమని మిమ్మల్ని ఎవరూ అడగలేదు.. ‘జి’ బలిసిన చదువుకున్న వాళ్లు మాత్రమే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారు” అంటూ క్రాకర్స్ కాల్చిన వాళ్లకు చురకలు వేశారు హీరో మంచు మనోజ్.

Related posts