టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు తనీష్ విచారణ ముగిసింది. దాదాపు 7గంటల పాటు ఈడీ అధికారులు తనీష్ ను ప్రశ్నించారు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిభందనల ఉల్లంఘనపై ప్రధానంగా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనీష్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు.. అనుమానస్పదంగా ఉన్న లెక్కలపై ఆరా తీశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి అతనిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
డ్రగ్స్ విక్రేత కెల్విన్తో ఉన్న సంబంధాలు? ఎఫ్ క్లబ్ పార్టీలు, డ్రగ్స్ సరఫరా చేసే వారితో సంబంధాలు, తదితర అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తనను మళ్లీ రమ్మని ఈడీ చెప్పలేదని, ఒకవేళ పిలిచినా వస్తానని తనీష్ తిరిగి వెళుతూ మీడియాకు చెప్పారు.
ఇప్పటివరకు పూరీ మొదలు ముమైత్ ఖాన్ వరకు సుదీర్ఘంగా విచారించారు ఈడీ అధికారులు. కెల్విన్తో లింకులు, ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీ, బ్యాంక్ ట్రాన్సక్షన్స్ పైనే ఈడీ విచారణ కొనసాగుతోంది. ఎఫ్ క్లబ్ లాంజ్లో జరిగిన పార్టీలో తనీష్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో దీని గురించి ఈడీ అధికారులు కూపీలాగారు.
ఇండస్ట్రీకి బాలకృష్ణ కింగ్ కాదు , కేవలం హీరోనే… నాగబాబు సంచలన వ్యాఖ్యలు