telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మొక్కలు మానవాళికి జీవనాధారం: ఎమ్మెల్యే రోజా

roja ycp mla

మొక్కలు మానవాళికి జీవనాధారమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు నగరిలోని పుత్తూరు ఎఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆమె 30 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటడమే సీఎం జగన్ లక్ష్యం అని తెలిపారు.

ప్రతి ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటి, రాష్ర్టాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మారుద్దామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం భాగస్వాములమై విరివిగా మొక్కలు నాటుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రోజా పలువురు ప్రముఖులకు గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. వారిలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, ఇరిగేషన్‌ మినిస్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ప్రముఖ టీవీ యాంకర్‌ రేష్మి గౌతమ్‌ ఉన్నారు.

Related posts