telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ ప్రచారం పుకార్ల పుట్ట..అబద్దాల గుట్ట : హరీష్ రావు

Harish Rao TRS

మంత్రి హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీ లపై మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మీటింగ్ పెడితే కిరాయి మనుషులు, పరాయి నాయకులు వస్తారని ఎద్దేవా చేశారు. ముత్యం రెడ్డి ఉన్నప్పుడు 30 వేలు ఇస్తేనే గాని ట్రాన్స్ఫార్మర్ లు ఇచ్చేవారు కాదని…ప్రతి పక్షాలకు అభివృద్ధి అంటే అర్థం తెలియదన్నారు. దుబ్బాక లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎగిరిగేరి పడుతున్నారని..ఉత్తమ్, బండి సంజయ్ కి దుబ్బాక ఎల్లలు తెలుసా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు పింఛను విషయం లో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని..నేను చేసిన రాజీనామా సవాలుకి నోట మాట రావడం లేదని ఫైర్ అయ్యారు. గట్టిగా చెపితే అబద్దం నిజం అవుతుందా..బిజెపీ సోషల్ మీడియాలో అవాస్తవాలు , మాయ మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రచారం పుకార్ల పుట్ట..అబద్దాల గుట్ట అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్ల కళ్ళలో పసరు పోసుకుని అభివృద్ధి కనిపించడం లేదని..తెలంగాణ వచ్చాక 24 గంటలు కరెంటు వస్తుందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే బావిల దగ్గర మీటర్లు పెడతారని.. వాళ్ళకి డిపాజిట్ రాకూడదని సూచించారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే కరెంట్ కష్టాలు వస్తాయని..అభివృద్ధి కొనసాగాలి అంటే టీ ఆర్ ఎస్ అభ్యర్థి కి ఓటు వేయాలన్నారు. బీజేపీకి ఓటు వేస్తె విదేశీ మక్కలు తెస్తారని..ఉత్తమ్ ఓట్లు అయ్యే వరకు ఉంటాను అన్నాడని విమర్శలు చేశారు. భర్త చనిపోయిన సుజాత ఏడుపును కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలు అవమానిస్తున్నారని మండిపడ్డారు.

Related posts