telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

ఫిలింనగర్ సిటీ బస్సులో కాల్పులు.. పోలీసే జరిపాడు..

gun firing in telangana city bus by constable

నేటి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫిలింనగర్ సిటీ బస్సులో కాల్పులు జరిపి ఓ వ్యక్తి పరారైన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యక్తి ఎవరనేది పోలీసు అధికారులు గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్ కానిస్టేబుల్ ఆర్. శ్రీనివాస్ బస్సులో కాల్పులకు తెగబడినట్టు సీసీ టీవీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖుడి వద్ద విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ నేటి ఉదయం విధులు ముగించికుని ఇంటకి వెళ్లేందుకు సిటీ బస్ ఎక్కాడు.

బస్సు కొద్ది దూరం వెళ్లగానే తోటి ప్రయాణికుడితో వాగ్వాదం జరిగింది. దీనితో శ్రీనివాస్ ఆగ్రహంతో తన వద్దనున్న తుపాకీ తీసి బెదిరించేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా కాల్పులు జరపడంతో బస్సు పై భాగంలో తూటా తగిలింది. అయితే శ్రీనివాస్‌కు అంతగా ఆగ్రహం కలిగించేందుకు దారి తీసిన పరిస్థితులు, శ్రీనివాస్‌కు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ డీజీపీ ఠాకూర్ మాట్లాడుతూ, హైదరాబాద్ పోలీసులు శ్రీనివాస్‌కు సంబంధించిన సమాచారాన్ని తమకు అందించారని తెలిపారు. అయితే జనం మధ్య కాల్పులు జరపడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్టు ఠాకూర్ తెలిపారు.

Related posts