telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన సింగర్ మను

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు సినీ సంగీత దర్శకుడు కోఠి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి గచ్చిబౌలి లో మొక్కలు నాటారు సింగర్ మను.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయువు లేనిదే మనిషే లేడు – ఆయువు ను ఇచ్చేది పచ్చని మొక్క అని తెలుపుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సింగర్ మను తెలిపారు.ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపిన సింగర్ మను.. అనంతరం మరో ముగ్గురు సింగర్స్ ( చిత్ర , సుజాత , శ్వేతా మోహన్ ) లు కూడా మొక్కలు నాటాలని సింగర్ మను పిలుపునిచ్చారు. అనంతరం సింగర్ మను కు , ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు , చక్రధర్ రెడ్డి లకు వృక్ష వేదం పుస్తకాలను అందజేశారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో. ఫౌండర్ రాఘవ.

Related posts