రేపు తెలంగాణలో బతుకమ్మ పండగ ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా జరుపుకునే బతుకమ్మపండగ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలుస్తారు. భక్తితో బతుకమ్మచుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ తమ పసుపు కుంకుమలు కాపాడమని, పిల్లాపాపలు చల్లంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే మంచి ఆరాగ్యాన్ని ఇవ్వాలని అమ్మవారిని కొలుస్తారు. భారత దేశంలో భిన్న సంస్కృతులకు ఇలాంటి పండగలు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అంటూ గవర్నర్ ప్రకటనలో పేర్కొన్నారు.
previous post


ఈవీఎంలలో జరిగిన అవినీతి వల్ల.. వైసీపీ గెలిచే అవకాశాలే ఎక్కువ: కేఏ పాల్