గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి.
కామెడీ ..యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా బన్నీ వాసు నిర్మించారు.ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి మూసాపేటలోని లక్ష్మికళ, శశికళ థియేటర్ల వద్ద 150 రూపాయలకే పక్కా కమర్షియల్ టికెట్లను విక్రయిస్తూ సందడి చేశాడు.
దర్శక నిర్మాతలకు తెలియకుండా బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న సప్తగిరిని చిత్ర సభ్యులు పట్టుకొని మారుతీ దగ్గరికి తీసుకొచ్చారు. అనంతరం సప్తగిరి, మారుతి మధ్య సాగిన సంభాషణ నవ్వులు పూయిస్తోంది.
సత్యరాజ్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో రావు రమేష్ విలన్ గా నటించాడు. వరలక్ష్మీ శరత్ కుమార్, చిత్ర శుక్ల కూడా ముఖ్య పాత్రలు పోషించారు.
నాగబాబు వల్లే గెలిచామా ? మీరెవరు చెప్పడానికి ? : జీవితరాజశేఖర్