telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మహిళలకు షాక్‌ : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ కూడాపెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటిన బంగారం ఇప్పుడు మొదటిసారి కిందకి దిగ్గి వచ్చింది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 53,520 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 49,070 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.420 పెరిగి రూ.51,600 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 390 పెరిగి రూ. 47,300 పలుకుతోంది. అటు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం వెండి ధర రూ.2100 పెరిగి రూ.74, 100గా ఉంది.

Related posts