ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ తనయుడు అజాన్ సమీ ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్నాన్ సమీ 1993లో పాకిస్థానీ నటి జీబా బఖ్తైర్ని పెళ్లి చేసుకున్నారు. వీరి కుమారుడే ఆజాన్. వివాహమైన మూడేళ్లకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అద్నాన్ 2001లో భారత్కు వచ్చేశారు. అయితే టీనేజ్ అంతా భారత్లో గడిపిన అజాన్ పాకిస్తాన్లో ఉండేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడు. “భారత్లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. అయినప్పటికీ పాక్నే నా సొంత ఇంటిలా భావిస్తాను. అక్కడి ఇండస్ట్రీ నాకు కుటుంబం లాంటిది. పాక్ ఇండస్ట్రీలో భాగమైనందుకు గర్వపడుతున్నా. మా అమ్మ దగ్గర ఎక్కువగా పెరిగాను. నాన్న నాకు ఫ్రెండ్ లాంటి వారు. ఏదైన సలహా కావాలంటే ఆయన దగ్గర నుండి తప్పక తీసుకుంటాను. మ్యూజిక్ సంబంధించి ఇద్దరం చాలా విషయాలు చర్చించుకుంటాం. అయితే కొన్ని సందర్భాలలో మేమిద్దరం మాట్లాడుకోలేదు కూడా. ఏదైన పని నచ్చకపోతే సలహా ఇవ్వగలను కాని ఇదే చేయాలి అని చెప్పే అర్హత మాకు లేదు. భారత పౌరసత్వం తీసుకోవడం ఆయన ఇష్టం” ఈ మ్యూజిక్ కంపోజర్ చెప్పుకొచ్చాడు. పాక్లో పుట్టిన అద్నాన్ ప్రస్తుతం భారత్లో నివసిస్తున్నారు. 2010లో సమీ రోయా ఖాన్ అనే ఆర్మీ జనరల్ కుమార్తెను పెళ్లాడారు. వీరికి 2017లో పండంటి ఆడపిల్ల జన్మించింది. ఇప్పుడు అజాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
next post