telugu navyamedia
సినిమా వార్తలు

ద‌ర్శ‌కుడు మణిరత్నంపై కేసు నమోదు..

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంపై పోలీస్ కేసు న‌మోద‌య్యింది. మ‌ణిర‌త్నం ప్ర‌స్తుతం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు.

Mani Ratnam's 'Ponniyin Selvan' shooting to resume by mid-November | Tamil  Movie News - Times of India

ఈ చిత్రీకరణలో ఓ గుర్రం మ‌ర‌ణించ‌డంతో పెటా ఇండియా మ‌ణిర‌త్నంతో పాటు సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యాన‌ర్ మ‌రియు తెలంగాణాకు చెందిన గుర్రం య‌జ‌మానిపై కూడా కేసు న‌మోదు చేసింది. పెటా ఇండియా ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు గుర్రం యజమాని పై పిసిఎ చట్టం, 1960 సెక్షన్‌ 11, 1860 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, సెక్షన్‌ 429 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూగ జంతువుల పట్ల క్రూరత్వంగా ఉండకూడదని ఇలాంటి చర్యలు భవిష్యత్తులో మళ్లీ జరగకూడదని, సంబంధిత దోషులకు శిక్ష పడాలని యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా అధికారులను కోరింది. అలసిపోయి, డీహైడ్రేడ్‌ అయిన గుర్రాల్ని షూటింగ్‌లో ఉపయోగించడం వల్లే గుర్రం మరణించిందని గుర్రం యజమాని తెలిపారు. జంతువులను ఇబ్బంది పెట్టే సన్నివేశాల్లో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ఉపయోగించాలనీ ప్రొడ్యూసర్లను పెటా కోరింది.

Mani Ratnam shoots with over 200 artists for a grand song in 'Ponniyin  Selvan' | Tamil Movie News - Times of India

కాగా..1995లో కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవలా ఆధారంగా ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, విక్రమ్ ప్రభు, త్రిష, మోహన్ బాబు, ఐశ్వర్యా రాయ్ వంటి వారు నటిస్తున్నారు.

Related posts