రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్లో జరగనుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు ప్రభాస్ చేరుకున్నారు. ఆయన మాస్క్ వేసుకుని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ ఫ్రాన్స్లో 200 మందికి కరోనా సోకింది. అక్కడ ఆల్రెడీ కరోనా బారిన పడి నలుగురు చనిపోయారు కాస్త కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేవరకు షూటింగ్ వాయిదా వేసుకోవచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క చాలా మంది సెలబ్రిటీలు షూటింగ్లు మానుకుని ఇంటి పట్టునే ఉంటున్నారు. కరోనా వైరస్ ముదురుతోందని తెలిసీ బయటికి వెళ్లడం ఎందుకని అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు సినిమా షూటింగ్ వాయిదా పడింది. మళ్లీ వాయిదా వేసే బదులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఫ్రాన్స్లో షెడ్యూల్ త్వరగా షూట్ చేసేయాలని టీం అనుకుంటోంది. తెలంగాణలో ఒకటి, ఢిల్లీలో ఒకటి, ఆగ్రాలో ఒకటి, కేరళలో మూడు, ఒక డ్రైవర్ సహా ఇటలీ నుంచి వచ్చిన 16మంది పర్యాటకులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి.
next post